Saturday, 31 January 2026 07:49:19 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

రక్తదానం చేద్దాం ప్రజల ప్రాణాలు కాపాడుకుందాం.యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)

Date : 26 February 2025 05:10 PM Views : 173

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : ప్రతిఒక్కరు రక్తదానం పట్ల అవగాహనా పెంచుకోవాలని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చు అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) రాష్ట్ర నాయకులు నీలం సత్యనారాయణ, కర్నూలు నగర కార్యదర్శి మునిస్వామిలు అన్నారు.బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వాయిస్ ఆఫ్ ఇండియా స్టాఫ్ రిపోర్టర్ జె. నాగరాజు సతీమణి జె.లక్ష్మిదేవికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నాయకులు, మన తెలుగు దినపత్రిక,విఎస్ 9 టీవీ కర్నూలు ప్రతినిధి వి.విజయ్ కుమార్ రక్తదానం చేశారు.ఈ సందర్బంగా నీలం సత్యనారాయణ, మునిస్వామిలు మాట్లాడారు.జె.లక్ష్మీదేవి అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుంది.ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న విజయ్ కుమార్ ఆమెకు రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరికి రక్తం అవసరం ఏర్పడుతుందని అన్నారు.మానవత్వంతో వారికి రక్తం ఇవ్వడం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోగలిగిన వారమవుతాం అని చెప్పారు.రక్తదానం పట్ల ప్రజలకు ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం రక్తదాత విజయ్ కుమార్ ను అభినందించారు.విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటికే సుమారు 10సార్లు రక్తదానం చేశానని తెలిపారు.రక్తదానం చేసిన సందర్బంలో బాధితుల కళ్ళలో సంతోషం నాకు ఆశీర్వాదాలుగా భావిస్తానని చెప్పారు. రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం కలగదని,కొద్దిరోజులోనే మన శరీరంలోకి కొత్త రక్తం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ శ్రీనివాసులు,జె.నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :