Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : ఖరీఫ్ సీజన్ లో వర్షాల కారణంగా దెబ్బ తిన్న ఉల్లి పంట ను ఎన్యూమరేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరిఅధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం ఆర్డీవోలు, తహసీల్దార్లు,ఎంపి డిఓలు,వ్యవసాయ అధికారులు,మండల స్పెషల్ అధికారులతో జిల్లా కలెక్టర్ విజయవాడ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఎన్యూమరేషన్ ను జాగ్రత్తగా చేయాలన్నారు.మీరు పంపిన డేటాను వర్షపాత నివేదికతో కోరిలేట్ చేసుకొని ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపుతామని కలెక్టర్ తెలిపారు..అలాగే ఉల్లి పంట పక్వానికి రాక ముందే కోయకుండా,110 రోజుల తర్వాత కోసి, తదుపరి బాగా ఆరబెట్టి, గ్రేడింగ్ చేసుకుని రైతు కు మార్కెట్ కు తీసుకొని వచ్చే విధంగా గ్రామ హార్టికల్చర్ అధికారి, గ్రామ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.110 రోజులు పంటను పండించకుండా ,క్యూరింగ్ చేయకుండా రైతులు ఉల్లి పంటను మార్కెట్ కి తీసుకొని వస్తున్నారని, తద్వారా మంచి ధర రైతులకు రావడం లేదని కలెక్టర్ పేర్కొన్నారు.అలాగే టమోటో పైన నల్ల న ల్లగా మచ్చలు వస్తున్నాయని, టమోటో కు మంచి ధర రావడం లేదని ప్రతికూల వార్తలు వస్తున్నాయన్నారు.మొక్కల సంరక్షణ చర్యలలో భాగంగా టమోటో పంట బాగా వచ్చే వి ధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, టమోటో కి మంచి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు.ఉల్లి పంట క్రాప్ బుకింగ్ శనివా రం లోపు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య మాట్లాడుతూ ఉల్లి పంట ఈ క్రాప్ బుకింగ్ 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవా లని జాయింట్ కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్ లో డి ఆర్ ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Voice Of India News