Saturday, 31 January 2026 07:49:57 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

ఎర్లీ ఖరీఫ్ సీజన్ లో వర్షాల కారణంగా దెబ్బ తిన్న ఉల్లి పంట ను ఎన్యూమరేషన్ చేయండి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Date : 16 September 2025 12:53 PM Views : 81

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : ఖరీఫ్ సీజన్ లో వర్షాల కారణంగా దెబ్బ తిన్న ఉల్లి పంట ను ఎన్యూమరేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరిఅధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం ఆర్డీవోలు, తహసీల్దార్లు,ఎంపి డిఓలు,వ్యవసాయ అధికారులు,మండల స్పెషల్ అధికారులతో జిల్లా కలెక్టర్ విజయవాడ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఎన్యూమరేషన్ ను జాగ్రత్తగా చేయాలన్నారు.మీరు పంపిన డేటాను వర్షపాత నివేదికతో కోరిలేట్ చేసుకొని ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపుతామని కలెక్టర్ తెలిపారు..అలాగే ఉల్లి పంట పక్వానికి రాక ముందే కోయకుండా,110 రోజుల తర్వాత కోసి, తదుపరి బాగా ఆరబెట్టి, గ్రేడింగ్ చేసుకుని రైతు కు మార్కెట్ కు తీసుకొని వచ్చే విధంగా గ్రామ హార్టికల్చర్ అధికారి, గ్రామ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.110 రోజులు పంటను పండించకుండా ,క్యూరింగ్ చేయకుండా రైతులు ఉల్లి పంటను మార్కెట్ కి తీసుకొని వస్తున్నారని, తద్వారా మంచి ధర రైతులకు రావడం లేదని కలెక్టర్ పేర్కొన్నారు.అలాగే టమోటో పైన నల్ల న ల్లగా మచ్చలు వస్తున్నాయని, టమోటో కు మంచి ధర రావడం లేదని ప్రతికూల వార్తలు వస్తున్నాయన్నారు.మొక్కల సంరక్షణ చర్యలలో భాగంగా టమోటో పంట బాగా వచ్చే వి ధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, టమోటో కి మంచి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు.ఉల్లి పంట క్రాప్ బుకింగ్ శనివా రం లోపు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య మాట్లాడుతూ ఉల్లి పంట ఈ క్రాప్ బుకింగ్ 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవా లని జాయింట్ కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్ లో డి ఆర్ ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :