Saturday, 31 January 2026 07:47:34 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

నిషేధిత గంజాయి,మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్

డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే ఈగల్ టీం టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి సమాచారం అందించాలి

Date : 22 September 2025 11:04 PM Views : 89

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం గంజాయి,మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆకస్మిక తనిఖీలు,నాకా బంది నిర్వహించాలని కర్నూలు పోలీసులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారని కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ తెలిపారు.డిస్పీ జె.బాబు ప్రసాద్ రైల్వేస్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని.కర్నూల్ రైల్వే స్టేషన్,కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు.ఆంధ్ర -ఒరిస్సా బార్డర్ నుండి డ్రగ్స్,మాదకద్రవ్యాలు అక్రమంగా రవా ణా జరుగుతుందని సమాచారం రావడంతో ఈ తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు.మాదక ద్రవ్యాల పై ఈగల్ టీం,కర్నూల్ పోలీసులు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమా లు కూడా నిర్వహిస్తున్నారన్నారు.యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని,డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే ఈగల్ టీం టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి సమాచారం అందించాలన్నారు.దేవీ నవరా త్రులు ప్రారంభమైనందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రజలు పోలీసుల కు సమాచారం అందించి సహకరించాలన్నారు.సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.కొందరు వ్యక్తులు ప్రయాణికుల చాటున ఎటువంటి అనుమానం రాకుండా రైళ్ల లలో డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ రవాణా పాల్పడుతుంటారన్నారు.కర్నూల్ పోలీసులు,జి ఆర్ పి పోలీసులు,డాగ్ స్క్వాడ్,బాంబ్ స్క్వాడ్ పోలీసులు,స్పెషల్ పార్టీ పోలీసులతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.అనంతరం కర్నూల్ నుండి నంద్యాల కు వెళ్తున్న రైలులో (77209) తనిఖీలు నిర్వహించారు.రైల్వే స్టేషన్ లోని పార్సిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.పార్సిల్ కార్యాలయంలో పార్సిల్స్ అనుమానాస్పదంగా ఉన్నా,నెలల తరబడి ఎక్కువ రోజులు పార్సిల్స్ డెలివరీ కాకుండా ఉన్నట్లయితే అటువంటి సమాచారాన్ని కర్నూలు పోలీసులకు అందించాలని రైల్వే పార్సిల్ కార్యాలయం సిబ్బందికి కర్నూలు డిఎస్పి తెలియజేశారు.ఈ తనిఖీలలో కర్నూల్ డిఎస్పి తో పాటు కర్నూల్ టూ టౌన్ సీఐ నాగరాజారావు,కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహా,కర్నూలు టు టౌన్ ఎస్సై సతీష్ కుమార్ యాదవ్,కర్నూలు నాల్గవ పట్టణ ఎస్సై రామ మునయ్య,స్పెషల్ పార్టీ పోలీసులు,డాగ్ స్వాడ్,బాంబ్ డిస్పోజల్ టీం,జిఆర్ పి పోలీసులు పాల్గొన్నారు.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :