Saturday, 31 January 2026 07:47:57 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్

విజయం అంటే కేవలం వ్యక్తిగత లక్ష్యాలను సాధించడమే కాదు,సమాజానికి ఉపయోగ పడాలి.గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్

Date : 12 November 2025 07:19 PM Views : 118

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : విజయానికి విద్య కీలకమని,విజయం అంటే కేవలo వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదు,సమా జానికి ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.బుధవారం నగరంలోని ఏ.క్యాంప్ లో ఉన్న మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో మాంటిస్సోరి సంస్థల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేష న్స్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మాంటిస్సోరి వి ద్యా సంస్థల అధినేత స్వర్గీయ కళ్యాణమ్మ అంకిత భా వంతో విద్యా రంగం అభివృద్ధికి కృషి చేశారని,పిల్లల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి వినూత్న బోధనా పద్ధతులను అమలు చేయడంలో మాంటిస్సోరీ విద్యా సంస్థలు కృషి చేశాయని తెలిపారు.పరిశ్రమల శాఖా మంత్రి టిజి భరత్,నంద్యాల ఎంపీ డాక్టర్ బి.శబరి,అనేక మంది రాజకీయ నాయకులు,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభు త్వాల ఐఎఎస్,ఐపిఎస్ అధికారి,వైద్యులు,న్యాయవాదు లు,పైలట్లు,సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు,ఉపాధ్యాయులు,శాస్త్రవే త్తలు మాంటిస్సోరి విద్యా సంస్థలలో చదువుకున్నారన్న విషయం తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు.విద్య ఆత్మవిశ్వాసాన్ని,ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందన్నారు .అసమానతలను తగ్గించడంలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.విద్య సామాజిక,ఆర్థిక స్థితిని మెరుగు పరుస్తుందని,పేదరిక చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. బాలికలు,మహిళలు చదువుకున్నప్పుడు వారి కుటుం బాలతో పాటు సమాజం కూడా ప్రయోజనం పొందుతుం దన్నారు.ప్రభుత్వం బాలికల విద్య,లింగ సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.బేటీ బచావో,బేటీ పడా వో కార్యక్రమం ద్వారా బాలికల విద్య ను ప్రోత్సహించేం దుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని,దీని వల్ల సమాజానికి మేలు కలుగుతుందని గవర్నర్ పేర్కొన్నారు .విద్య బలమైన,ఆరోగ్యకరమైన సృజనాత్మక మరియు అభివృద్ధి చెందిన సమాజాన్ని సృష్టించడానికి ఉపయోగ పడే శక్తివంతమైన సాధనం అన్నారు.క్రమశిక్షణ మరియు సమయ నిర్వహణ ద్వారా జీవితంలో విజయం సాధించ బడుతుందన్నారు.పాఠశాలలు ఈ లక్షణాలను విద్యార్థు లకు చిన్నప్పటి నుండే నేర్పించాలని,విద్యార్థులు సమ యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం లాంటివి నేర్పిం చాలన్నారు.ఈ నైపుణ్యాలు నేటి వృత్తిపరమైన ప్రపంచం లో చాలా ముఖ్యమైనవి అని గవర్నర్ పేర్కొన్నారు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూ లు పట్టణంలో 50 సంవత్సరాల క్రితమే కీర్తిశేషులు కల్యా ణమ్మ మాంటిస్సోరీ పాఠశాలకు పునాది వేశారన్నారు.ఇ ప్పుడు 50 సంవత్సరాల తర్వాత మాంటిస్సోరీ విద్యా సంస్థలు అనేక బ్రాంచ్ లు ప్రారంభించి వేలాది మంది వి ద్యార్థులకు చదువును నేర్పిస్తున్నారని తెలిపారు.మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాంటిస్సొరి విద్యా సంస్థలు విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసిం చారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :