Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : సంయుక్తరెడ్డి పేరుతో ట్విట్టర్లో అక్కౌంట్ ఓపెన్ చేసి,న్యూడ్ వీడియో కాల్స్ పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూన్న ముఠాను అరెస్టు చేసినట్లు కర్నూలు రెండవ పట్టణ సిఐ నాగరాజారావు తెలిపారు.ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ కర్నూలు టౌన్ లోని ఒక వ్యక్తిని కూడా ట్రాప్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడి,విలువైన పొలాలు తక్కువ దరకే అమ్ముతాము అని నమ్మించి పలు దఫాలుగా ఫిర్యాదిని మరియు అతని కుటుంబ సభ్యులను చంపుతాము అని బెదిరించారని,బలవంతంగా ఫిర్యాది నుండి సుమారుగా రూ.3,80,00,000/- (అక్షరాల మూడు కోట్ల ఎనబై లక్షల రూపాయలు) అక్రమ వసూళ్లు చేశారన్నారు.అందులో నుండి రూ.41,28,000/- (అక్షరాల నలభై ఒక్క లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు) విలువ కలిగిన రెండు కార్లు,ఒక మోటార్ సైకల్ మరియు బంగారు ఆభరణాలు వస్తువులను కొని,మిగిలిన డబ్బులు రూ.33,874,000/-(అక్షరాల మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు) లను ముగ్గురు కలిసి జల్సాలకు వాడుకున్నారని తెలిపారు. (1) చిక్కిరి మల్లేశ్,వయస్సు 27 సం,తండ్రి పేరు చిక్కిరి సత్తయ్య,ఇంటి నంబరు-3-138,బలరాం నగర్,కల్వకుర్తి టౌన్ మరియు మండలము,నాగర్ కర్నూలు జిల్లా.తెలంగాణ (2) పెరుమాళ్ల మేరీ,వయస్సు 26 సం,భర్త పేరు చిక్కిరి మల్లేశ్, తండ్రి పేరు పెరుమాళ్ల రామస్వామి,H.NO.3-138,బలరాం నగర్, కల్వకుర్తి గ్రామము మరియు మండలము, నాగర్ కర్నూలు జిల్లా,తెలంగాణ (3) పేరు మొల్లరి మల్లిక @ లిల్లీ,వయస్సు 33 సం,భర్త.మొల్లరి మల్లేశ్,సొంత ఊరు కమ్మ గూడెం,మర్రిగూడ మండలం,నల్గొండ జిల్లా,ప్రస్తుతము కల్వకుర్తి గ్రామము మరియు మండలము,నాగర్ కర్నూలు జిల్లా,తెలంగాణ పై తెలిపిన ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.కావున ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు రెండవ పట్టణ పోలీసులు పేర్కొన్నారు
Admin
Voice Of India News