Saturday, 31 January 2026 07:48:00 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులలో 5 మందికి 9 సంవత్సరాల 2 నెలల జైలు శిక్ష . ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి వాసు

Date : 19 September 2025 11:33 PM Views : 528

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలో నమోదైన 2 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులలో 5 మందికి 9 సంవత్సరాల 2 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ కర్నూలు ఎస్సీ ఎస్టీ విభాగం కోర్టు జడ్జి వాసు తీర్పు వెలువరించారు.కర్నూలు జిల్లా,కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీ కి చెందిన 5 మంది కి జైలుశిక్ష విధించారు. 1.నేసే శ్రీనివాసులు (50),2.నేసే రాజు (24) 3.నేసే సరోజ (45) భర్త శ్రీనివాసులు 4.నాగజ్యోతి (26)5.నేసే వెంకటేశు అలియాస్ వెంకటేష్ వీరందరూ ఒక కుటుంబంనికి చెందిన వారు కాలనిలో వీరి ఇంటి పక్కన గోవిందమ్మ కుటుంబం నివసిస్తూ ఉంటారు.గోవిందమ్మ ఇంటి నుండి వచ్చే మురికి నీళ్ళు వీళ్ళ ఇంటి స్ధలంలోకి వస్తున్నాయని 2018 మే17 తేదిన నేసే శ్రీనివాసులు కుటుంబ సభ్యులు గోవిందమ్మతో గొడవలు పడి కులం పేరుతో దుసించిన్నారు.మరొకసారి 2018 జూన్ 3 వ తేదిన గోవిందమ్మ ఇంటి నుండి నేసే శ్రీనివాసులు ఇంటి స్ధలంలో కి మరల మురికి నీళ్ళు వస్తున్నాయని గోవిందమ్మను దాడి చేసి గాయపర్చినారు.ఈ విషయం పై కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ లో 2 కేసులు నమోదు అయినవి. Cr.No.245/2018 U/s 323, 324, 354, 506 r/w 34 IPC & sec 3(1)(r)(s) of SC/ST Act. Cr.No.220/2018 U/s 324 r/w 34 IPC & sec 3(1)(r)(s), 3(2)(va) of SC/ST Act అప్పటి ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ లు మురళీధర్ రెడ్డి,వినోద్ కుమార్ లు సమగ్రంగా దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.అన్ని కోణాల్లో ఈ కేసును విచారించిన పిదప నేరం ఋజువు కావడం తో ఎస్సీ ఎస్టీ విభాగం కోర్టు జడ్జి వాసు 5 మంది నిందితులకి మొత్తం 9 ఏళ్ళ 2 నెలల పాటు జైలు శిక్ష విధించారు. నేసే శ్రీనివాసులు కు రూ. 25 వేలు జరిమానా,మిగతా నలుగురికి నేసే రాజు, నేసే సరోజ.నాగజ్యోతి.నేసే వెంకటేశులు ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధించారు.కేసు నమోదు చేసి,పక్కాగా దరాప్తు చేసిన డీఎస్పీలను.పోలీసు అధికారులను, సాక్షులను కోర్టు యందు హాజరు పరిచిన కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ప్రత్యేకంగా అభినందించారు.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :